రచ్చ సినిమాతో రెండు సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీతో దోబుచులాడుతున్నా హిట్ ను మెగా కొలువులో కట్టేసి... వారికీ కొత్త సంతోషాలను అందించిన దర్శకుడు సంపత్ నంది రామ్ చరణ్ తో మళ్లీ సినిమా చెయ్యాలని తహతహలాడుతున్నాడు.
ఆ కోరికను మనసులోనే పెట్టుకోకుండా దానికి ఒక రూపాన్ని ఇచ్చి 'చోట మేస్త్రి' అని పేరు పెట్టి మంచి సమయం చూసుకుని బుల్లి మెగాస్టార్ ను మెప్పించేశాడు. కధ సంగతి తరవాత ముందు 'చోట మేస్త్రి ' అనే టైటిల్ కే పడిపోయిన చెర్రి సినిమా చెయ్యాలని డిసైడ్ అయిపోయాడంటా..!
మెగాస్టార్ కు 'ముఠామేస్త్రి ' లా తనకు 'చోటమేస్త్రి' జనాల మదిలో ఎప్పటికి నిలిచిపోవాలని డ్రీమ్స్ వరకు వెళ్ళిన చెర్రి వెంటనే నాన్నకు కధ వినిపించి ఆమోదం తీసుకోమని నందిని పూరమయించాడంటా...! ఆ పని మీదే ఉన్న సంపత్ చిరు ఫ్రీ టైం కోసం కాచుకుని ఉన్నాడు. సెంట్రల్ మినిస్ట్రీతో కొత్తభాద్యతలు స్వీకరించిన చిరు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా అయన స్టాంప్ ఉంటేనే సినిమా సెట్స్ ఫై కి వెళ్తుందంటే కొంత ఇబ్బంది కలిగించే అంశమే.,..! అందుకనే ఒక పక్క సంపత్ చిరు కోసం వేచి చూస్తూనే మరో పక్క ఇతర హీరోలకు వేరే కధలు చెప్పటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది.
రెండు బ్లాక్ బాస్టర్స్ ఇచ్చినప్పటికీ ఇంకా తండ్రి అజ్ఞానే శిరశావహించటం తండ్రి పట్ల చెర్రి వినయానికి ప్రతీక. ఇంతకుముందు పర్వాలేదు కాని ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన చిరు ఇలాంటి విషయాలకు టైం కేటాయించటం అనేది కొంచెం కష్టమైన పనే. ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకుని చెర్రీ ఇక సొంత నిర్ణయాలకు ప్రాదాన్యం ఇవ్వాలని ఒత్సహికులు కోరుకుంటున్నారు.

No comments:
Post a Comment